భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ

TEJA NEWS

చిలకలూరిపేట:భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ కోసం ఈనెల 9వ తేదీ జరగనున్న భవ నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చే యాలని పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం సిఐటి యు పల్నాడు జిల్లా ప్రధాన కార్యద ర్శి మసూద్ శిలార్ బుధవారం నాడు పిలుపునిచ్చారు. స్థానిక కళా మందిర్ సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం సమ్మె కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల హక్కులను హరిస్తూ తీసుకువచ్చిన లేబర్ కోడ్ ల వల్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దయ్య ప్ర మాదం ఉందని ప్రస్తుతం అన్ని రా ష్ట్రాల్లో అమలు అవుతున్న సంక్షేమ బోర్డు కూడా రద్దు అవుతాయన్నారు ప్రస్తుతం 10 లక్షల పైబడి యజమా ని వద్ద నుంచి సెస్ వసూలు చేస్తుం టే దాన్ని 50 లక్షలకు పెంచుతూ ఆ వ్యాయాన్ని ఇంటి యజమాని ధ్రువీ కరించాలని షరతులతో సంక్షేమ బో ర్డు అటకెక్కించే విధంగా ఈ నిర్ణయా లు ఉన్నాయని గత జగన్మోహన్ రె డ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికు ల సంక్షేమ పథకాలన్నీ నిలుపుదల చేస్తూ తీసుకువచ్చిన మెమో నెంబ ర్ 1214 రద్దు చేస్తామని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి సం వత్సరం గడుస్తున్నారు. అది రద్దు కాకపోవడం వల్ల గత ఆరు సంవత్స రములుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ప్రమా దంలో చనిపోయిన వారు,శాయ మ రణం చెందిన వారు కాలి పోయిన వారు ప్రమాదాల్లో గాయపడిన వా రు వివిధ రకాల కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు జరుగు తున్నారన్నా రు.

ఈ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల తొమ్మిదవ తేదీన జరుగుతు న్న సార్వత్రిక సమ్మె సందర్భంగా చిల కలూరిపేట లోని నరసరావుపేట సెం టర్ వద్ద నుండి కళామందిర్ సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన జరుగుతుం దని ఈ ప్రదర్శనలో భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పా ల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సిఐటియు మండల కన్వీ నర్ పేరుబోయిన వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ భవన నిర్మాణ కార్మి కుల తో పాటు అనేక రకాల వృత్తులు ఉద్యోగాలు చేసేవారు లేబర్ కోడ్లు అమలయితే తీవ్రమైన ఇబ్బందులు గురవుతారని పోరాడి సాధించుకు న్న ఎనిమిది గంటల పని విధానాన్ని కనీస వేతనాలను యాజమాన్యంతో వేతన ఒప్పందం కోసం జరిగే భేరా సారాలను ఆడే హక్కు, సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సమ్మె కు వెళ్లే హక్కు ఇటువంటి హక్కులన్నీ రద్దయిపోయన్నారు. యజమానుల దయాదాస్యమ్యాలతో బతికే పరిస్థి తి కార్మిక వర్గానికి వస్తుందని వీటన్ని టికీ వ్యతిరేకంగా జరుగుతున్న స మ్మె ర్యాలీలో కార్మికులందరూ పాల్గొ ని జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో కె. వెంకటే శ్వర్లు, కే. కళ్యాణ్ వెంకటేశ్వర్లు,ఇతర రంగాల కార్మికులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top