మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ
TG: వరంగల్లో కొండా దంపతులకు పలువురు ఎమ్మెల్యేలకు మధ్య సైలెంట్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఆ దంపతులు భేటీ అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆమెతో చర్చించారు. అటు కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని వ్యతిరేక వర్గం పట్టుబట్టగా టీపీసీసీకి మురళి వివరణ ఇచ్చారు.
