కులమతాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు
చిలకలూరిపేట:
స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి వేడుకలలో భాగంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సాయి ప్రశాంతి వృధా ఆశ్రమం లో ఉదయం వృద్ధులకు అల్పాహారం విందు ఏర్పాటు చేయటం జరిగింది తదుపరి విశ్వనాధ్ సెంటర్, మరియు అడ్డరోడ్డు సెంటర్ల వద్ద గల రంగా విగ్రహాలకు పాలాభిషేకం, చేసి నివాళులు అర్పించటం జరిగింది ఈ కార్యక్రమములో చిలకలూరిపేట పట్టణ కాపు సంక్షేమ నాయకులు,ఉయ్యూరు నరసింహారావు, కౌన్సిలర్ షేక్ మౌలాలి , చల్లా వెంకయ్య , SR టైలర్ శ్రీనివాసరావు , తోట అప్పయ్య, పుల్లంశెట్టి చంద్రమౌళి , పక్కెల పరమేశ్వరావు, కమ్మిళీ శివా రామకృష్ణ, వేజండ్ల సుబ్రహ్మణ్యం, బోనం శ్రీనివాస రావు, కటారి లోకేష్, బత్తినేని భాను, గోదాసు సుర్యాణారాయణ, బాలా సాయి, గుడూరు హేమంత్, టైలర్ మొత్తంశెట్టి ప్రసాద్,తంగేళ రాంమోహన్ , తదితరులు పాల్గొని జయప్రదం చేసినారు
