ఆంబీర్ చెరువు వద్ద ఉన్న నిమజ్జనం కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన

TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న నిమజ్జనం కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను KPHB సీఐ , ట్రాఫిక్ ఎస్ఐ , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, శానిటేషన్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు.పి ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అని, ప్రజలు అందరూ నిభందనలు ప్రకారం అధికారుల సూచనలతో తగు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో KPHB సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మాధవ్ రెడ్డి, జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎలక్ట్రికల్ DE స్వప్న, ఇన్చార్జి సుధాకర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top