పేదల ఆర్థిక ప్రగతికి పి-4 దోహదం.

TEJA NEWS

పేదల ఆర్థిక ప్రగతికి పి-4 దోహదం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి,

పేదల ఆర్థికస్థితిని మెరుగు పర్చడమే పి-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పి-4 కార్యక్రమంలో భాగంగా మైలవరం జ్యుయలరీ షాప్స్ ఆధ్వర్యంలో మేడసాని కిషోర్ సౌజన్యంతో కొండపల్లిలో 10 కుటుంబాలకు రూ.80 వేల విలువైన సామాగ్రి, నగదును ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ దార్శనికులు సీఎం చంద్రబాబు గారి ఆలోచనలో నుంచి పి-4 ఉద్భవించిందన్నారు. సంపద కలిగిన కుటుంబాలు అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలబడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. పేదల సాధికారత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నత కుటుంబాల వారంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలను ఆదుకున్న దాతలను అభినందించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top