అమరావతి
కడప కు చెందిన మహిళ క్రికెటర్ శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు.
1000గజాల ఇంటి స్థలం
గ్రూప్ వన్ ఉద్యోగం కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల భారత దేశం మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన విషయం తెలిసిందే.. మన రాష్ట్రానికి చెందిన శ్రీ చరణి ఈ సిరీస్ లో బాగా రాణించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ను ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. చంద్రబాబు ఆమె ను భుజం తట్టి ప్రోత్సహించి ఆమె కు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అండ దండలు అందిస్తామన్నారు.భవిష్యత్తులో క్రికెట్ లో బాగా రాణిస్తూ దేశం తోపాటు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమెను సీఎం చంద్రబాబు కోరారు.
