ప్రియదర్శిని మోడల్ హై స్కూల్, ప్రకాశం పంతులు నగర్ నగర్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను అభినందించి, సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో తమ ప్రతిభను కనపర్చిన పిల్లలను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, వీరు దేశ భవిష్యత్తుకు నాంది అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ సమీర్, మరియు అధ్యాపకులు, మరియు కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ ,నారాయణ, షాకీర్, మల్లం శ్రీనివాస్, తోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
