చిలుకూరు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు.. *మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ రాజా మోహమద్…
చిలుకూరు : మైనర్లు వాహానాలను నడపితే చట్ట పరంగా చర్యలు
చిలుకూరు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ రాజా మోహమద్
మైనర్లు వాహానాలను నడిపితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని
మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ రాజా మోహమద్ హెచ్చరించారు. చిలుకూరు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత వార్సోతాలలో భాగంగా విద్యార్థులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లుకు వాహానాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడ కేసులు నమోదు చేస్తామని అన్నారు. రోడ్డు దాటేటప్పుడు విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం భద్రత వారోత్సాల ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
