సీనియర్ నాయకురాలికి పరామర్శ
తెలంగాణా భవన్ సమీపంలో ఇటివల జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ అడ్డగుట్ట డివిజన్ బీ.ఆర్.ఎస్. సీనియర్ నాయకురాలు వసంతను సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ పరామర్శించారు. అడ్డగుట్ట లోని ఆమె నివాసంలో వసంత యోగ క్షేమాలను పద్మారావు గౌడ్ ఆరా తీశారు. కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, సామల హేమ, కంది శైలజ, నాయకులు పాల్గొన్నారు.
