19 వ వార్డు లో ఇంటింటి ప్రచారం….19 వ వార్డు ప్రగతికి ఓటేయండి… *తుమ్మలపల్లి అజంతా భాస్కర్ రావు…
కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 19వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మలపల్లి అజంతా భాస్కర్ రావు గురువారం వార్డులో ముమ్మరంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ వార్డులో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఓటర్లకు విన్నవించారు.
