ఐఎన్టియుసి ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శిగా పూసాల తిరుపతి నియామకం…..
పెద్దపల్లి : జాతీయ కార్మిక సంఘం ఐఎన్టియుసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శిగా రామగుండం ప్రాంతానికి చెందిన పూసాల తిరుపతి ని నియమించినట్లు ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి.సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా పూసల తిరుపతి మాట్లాడుతూ… నన్ను ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శిగా నియమించినందుకు డాక్టర్ జి.సంజీవరెడ్డి కి, రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శులు ఆర్.డి చంద్రశేఖర్ కి, వి భాస్కర్ రెడ్డి కి, నాయకులు జనక్ ప్రసాద్ కి, బాబర్ సలీం పాషా కి, సత్యజిత్ రెడ్డి కి, విజయ్ కుమార్ యాదవ్ కి, నాగన్న గౌడ్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
