సూర్యాపేటలో వాహనాల వేలం నిర్వహణ

TEJA NEWS

సూర్యాపేటలో వాహనాల వేలం నిర్వహణ

సూర్యపేట జిల్లా : సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల‌కు సంబంధించి గురువారం (మార్చి 5) ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలం కార్యక్రమం సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మనాయక్ ఆధ్వర్యంలో జరుగనుంది. వివిధ ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేయబడిన మొత్తం 24 వాహనాలు ఈ వేలంలో ఉంచబడనున్నాయి. కేసుల పరిష్కారం అనంతరం చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కావడంతో వీటిని ప్రజలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

వేలంలో పాల్గొనదలచిన వారు అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్‌లో ముందస్తుగా ధరావత్ (EMD) రుసుము చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ధరావత్ చెల్లించిన వారికి మాత్రమే వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అత్యధిక ధర పలికిన వ్యక్తికి వాహనం కేటాయించబడుతుంది. వేలంలో పాల్గొనే వారు తమ ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు వెంట తీసుకురావాలని, వేలం నిబంధనలు మరియు షరతులు ముందుగానే తెలుసుకుని పాల్గొనాలని అధికారులు సూచించారు. వాహనాల స్థితి, పత్రాల వివరాలు సంబంధిత కార్యాలయంలో పరిశీలించవచ్చని తెలిపారు. ఆసక్తి గల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారులు కోరారు.

You cannot copy content of this page

Scroll to Top