ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత.
విజయవాడ, మార్చి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు ఉదయం విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి Chairman Borra Radha Krishna and Board Members ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు.
ముఖ్య విశేషాలు:
అమ్మవారి దర్శనం: మంత్రి గారు తొలుత మూలవిరాట్ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
