
పాలెఅన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో 85 చిత్ర పటాలు ఆవిష్కరణ….తహసిల్దార్ ధ్రువ కుమార్, సర్పంచ్ మండవ జయమ్మ, వెంకటేశ్వర్లు…
చిలుకూరు మండలం పాలెఅన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో జాతయ నాయకులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారుల చిత్ర పటాలను ఆవిష్కరణను ప్రారంభింస్తున్న తహసీల్దార్, సర్పంచ్ పాలెఅన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో దాతల
సహాకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 65 జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారుల చిత్ర పటాలను తహసీల్దార్ ధృవకుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఆదర్శనీయం అయిన జాతీయనాయకులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు తదితర నాయకుల చిత్ర పటాలను ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ మండవ జయమ్మ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ గండ్ర లింగస్వామి, ఆర్ఎ మంత్రిప్రగడ సీతరామచందర్రావు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు