
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ నియామకం మీనాక్షి నటరాజన్ (తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జ్) మరియు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (తెలంగాణ పీసీసీ అధ్యక్షులు) ఆదేశాల మేరకు జరిగింది.
“సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం కింద మండలాలు, పట్టణాలు, విభాగాలు, గ్రామాల కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ గ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మీనాక్షి నటరాజన్ కి, మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.