బాధితులకు ఎల్ వో సి చెక్ అందజేత

TEJA NEWS

బాధితులకు ఎల్ వో సి చెక్ అందజేత

భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో ప్రైజర్ పేటకు చెందిన పాటిబండ్ల ప్రకాష్ కు మంజూరైన రూ 2 లక్షల 20 వేల విలువ గల ఎల్ వో సి చెక్కును బాధితుడి కుటుంబానికి అందించినట్టు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
పాటిబండ్ల ప్రకాష్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానిక టిడిపి నాయకులు పల్లె పోగు ప్రసాద్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి ఎల్ వో సి చెక్కును జారీ చేయడంతో కార్యాలయ కార్యదర్శి చెక్కును అందజేశారు.
బాధిత కుటుంబ సభ్యులు సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top