డిల్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు

TEJA NEWS

డిల్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను నమ్మని ఢిల్లీప్రజలు………… బిఆర్ఎస్.

వనపర్తి

డిల్లీలో ప్రజల తీర్పు రాహులు గాంధీ,రేవంత్ రెడ్డి అసమర్ధతకు నిదర్శనం.ఈ ఎన్నికల ఫలితాలతో రాబోవు కాలములో ప్రజా సంక్షేమం, అభివృద్దిని సమానంగా నడిపిన బి.ఆర్.ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం తథ్యం అని తేటతెల్లమైంది.
రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయకుండా అమలు చేసినట్లు ప్రచారం చేయడాన్ని మహారాష్ట్ర, డిల్లీ ప్రజలు విశ్వసించలేదని కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా బహుమతిగా ఇచ్చారు అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బి.ఆర్.ఎస్ పార్టీదే అధికారం అని స్పష్టం చేశారు.ఈ సమావేశములో మీడియా జిల్లా కన్వీనర్ నందిమల్ల.అశోక్,మంద రాము పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top