ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్

TEJA NEWS

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన గిరిజన సంఘాల నాయకులు

స్పందించిన కమిషన్ఎమ్మెల్యే కు నోటీసులు జారీ

వనపర్తి

హస్తినాపురం డివిజన్ గిరిజన మహిళా కార్పొరేటర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయకపోవడంతో గిరిజన సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.
ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కి ఫిర్యాదు పత్రాన్ని అందజేసిన గిరిజన సంఘాల నాయకులు గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహన్ గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర. అధ్యక్షులు శివ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్ పతి నాయక్ బంజారా విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ భరత్ నాయక్ తదితరులతో కలిసి ఫిర్యాదు చేశారు
ఫిర్యాదుకు స్పందించిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ తక్షణమే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ – “ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది

You cannot copy content of this page

Scroll to Top