దళిత బహుజనల రాజ్యాధికారం కోసం ఐక్యం

TEJA NEWS

దళిత బహుజనల రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని బి.ఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్ పిలుపు

వనపర్తి
దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి అక్కడ బాబు గౌడ్ పిలుపునిచ్చారు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం
మూలమల్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సమాజ్ వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్ తో పాటు సమాజ్ వాది పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ జానంపేట రాములు పాల్గొనడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందిని 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దళిత వెనుకబడిన వర్గాలు దేశంలో జరిగిన అభివృద్ధికి అవకాశాలకు దూరం చేయబడినారు కావున రాజకీయ అధికారం అధికారం సాధించడం ద్వారానే అన్ని రంగాలలో అభివృద్ధిని అందుకోవడానికి అవకాశం ఉందని అన్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత కాలం పోరాటం చేసి వయోజన ఓటు హక్కును సాధించి దేశ ప్రజలందరికీ అందించారు ఈ ఓటు హక్కుతోనే బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించి అన్ని రంగాలలో జనాభా ప్రాతిపదికన వాటా పొందాల్సిన అవసరం ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజికవేత నీరు గంటి రాఘవేంద్ర గౌడ్ సుధాకర్ రవి కుమార్ అశోక్ యాదవ్ అంబేద్కర్ అభిమానులు ప్రజలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top