ISRO: ఈ నెల 18న మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

TEJA NEWS

ISRO: ఈ నెల 18న మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో
రీశాట్-1బీ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో

సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడనున్న రీశాట్-1బీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా ఈ నెల 18వ తేదీ ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 వాహకనౌకను ప్రయోగించనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం ‘రీశాట్-1బీ’ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేస్తున్నారు.

ఈ రీశాట్-1బీ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన (హై-రిజల్యూషన్) చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది.

దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించగలదు

You cannot copy content of this page

Scroll to Top