బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ లో అడ్మిషన్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వారావుపేట మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమాయ్యాయని ప్రిన్సిపల్ టి.సంగీత ప్రకటనలో తెలిపారు. పదో, తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో సీట్లు ఖాళీ ఉన్నాయని, ఆసక్తిగల మైనార్టీ బాలికలు అప్లై చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థినులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కళాశాలలో సంప్రదించగలరని కోరారు.
