వడ్లమూడి వారి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న దారపనేని, కాకొల్లు
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఎండి వడ్లమూడి నాగేంద్ర శ్రీమతి లక్ష్మీ శిరీష దంపతుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమం తాడేపల్లి లోని వి.ఆర్ అపార్ట్మెంట్స్ లో నిర్వహించారు. ఈ నూతన గృహప్రవేశం కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత కాకొల్లు నాగేశ్వరరావు పాల్గొని వడ్లమూడి నాగేంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వడ్లమూడి ని దారపనేని పట్టు వస్త్రంతో సత్కరించారు, కాకోల్లు నాగేశ్వరరావు మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ శ్రీ సీతారాముల చిత్రపటాన్ని బహుకరించారు. వడ్లమూడి హరికృష్ణ, నాగార్జున, అల్లు శ్రీనివాసులు, దుద్దుకూరి లక్ష్మణ్, కాకొల్లు బాబురావు, నంబూరి నరసింహారావు, బురగా వెంకటేశ్వర్లు, పర్వతనేని బద్రీనాథ్, మన్నం వెంకటస్వామి, కామిరెడ్డి లక్ష్మణ్, మాగంటి మాధవ, ఏనుగంటి వెంగళరావు, కొట్టే సాయి తదితరులు వడ్లమూడి వారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
