యోగాతో ప్రశాంతత

TEJA NEWS

యోగాతో ప్రశాంతత

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అమరావతి లోని, పాత మ్యూజియం ప్రాంగణంలో జరిగిన యోగ వేడుకల్లో టిడిపి ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమం జరిగి యోగాసనాలు అనుసరించారు. విశాఖ వేదికగా జరిగిన యోగ వేడుకలను స్క్రీన్ మీద తిలకించారు. అనంతరం ఈ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతత అవసరమని, అది యోగాతో సిద్ధిస్తుందన్నారు. యోగ విశిష్టతను ప్రపంచానికి చాటెందుకు.. విశాఖ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం మ్యూజియంలోని పురావస్తు వస్తువులను, విగ్రహాలను పరిశీలించారు

You cannot copy content of this page

Scroll to Top