ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన 45 ఏండ్ల తల్లి

TEJA NEWS

ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన 45 ఏండ్ల తల్లి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు

వివాహేతర సంబంధం కారణంగా పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత(45)

ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి ఏర్పడ్డ పరిచయం

పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఘాతుకానికి పాల్పడ్డ రజిత

ఈ నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపిన తల్లి

అయితే పెరుగు తినకుండా.. వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయిన భర్త చెన్నయ్య.. తర్వాత పిల్లలకు పెరుగన్నం పెట్టిన నిందితురాలు

అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08)

కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య

మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు

విచారణలో బయటపడ్డ రజిత బాగోతం

రజిత టెన్త్ క్లాస్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

You cannot copy content of this page

Scroll to Top