సీఎం సహాయనిధి నుండి 1.50 లక్షల రూపాయల LOC

TEJA NEWS

చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి లక్ష్మి నరసమ్మ కి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయనిధి నుండి 1.50 లక్షల రూపాయల LOC ను మాజీ మంత్రి , నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.
అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ప్రభుత్వం అని, ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , షేక్ కరీముల్లా , బండారుపల్లి సత్యం , జవ్వాజి మదన్ , పఠాన్ సమద్ , కామినేని సాయిబాబా , తుపాకుల అప్పారావు , మద్దుమాల రవి , మురకొండ మల్లిబాబు తదితరుల పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top