నాదెండ్ల మండల ఎంపీడీవో స్వరూప రాణి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తహశీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో నిర్మల లక్ష్మీ కుమారి, మెడికల్ ఆఫీసర్లు జ్ఞానేశ్వరి, ప్రసాద్ నాయక్, ఎంఈవో కృష్ణా రెడ్డి, ఎపిఎం రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, విఆర్వోలు, సిసిలు సాంబశివరావు, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, ఎఎన్ఎంలు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
