ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాబ్ మేళా
తిరుపతి: తిరుపతి లోని కొత్తవీధికి చెందిన
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు జీవన భృతి కల్పించాలనే సామాజిక సేవగా బుధవారం (నేడు) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు కిషోర్, వాసు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆలోచనల్లో భాగంగా పే -టీఎం , జెప్టో (హైదరాబాద్) వారు, రెప్యూటెడ్ రీటెయిల్ కంపెనీ వారు సంయుక్తంగా ఆర్యవైశ్య సంఘం కార్యలయంలో జూలై 2, బుధవారం ఉదయం 10 గం. ల నుంచి సాయంత్రం 4 వరకు ఉచితంగా మెగా జాబ్ మేళా నిర్వహించుటకు సన్నాహలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాతో ఇంటర్వ్యూకి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరని, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి వారికి ప్రాధాన్యత కలదని తెలిపారు. మంచి జీతం, ఇన్సెంటివ్స్ కలవన్నారు. పదవ తరగతి, ఆపై పాసైన వారు హాజరు కాగలరని కోరారు. పురుష అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలన్నారు.
