4వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి….
చేవెళ్ల నియోజకవర్గం : చేవెళ్ల పట్టణ సమీపంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్ లో *పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు మరియు గ్రామ స్థాయి కమిటీ సభ్యుల తో సమావేశం నిర్వహించిన TPCC వైస్ ప్రెసిడెంట్, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బొంతు రామ్మోహన్ , నారాయణ పేట శాసనసభ్యులు పర్ణిక రెడ్డి మరియు చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
జై బాపు, జై భీం, జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి శుక్రవారం నాడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు ఏఐసీసీ అధ్యక్షులు * ఖర్గే* హాజరవుతున్న సందర్భంగా పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, గ్రామ కమీటీల సభ్యులు, పార్టీ ముఖ్యనాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, సభను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
