విజయవాడ రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తి వంగవీటి మోహనా రంగా.
నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాల యంలో వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కూటమి నేతలు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగా సామాజిక న్యాయంపై దృష్టి సారించారు, భూమిలేని వారికి భూ పంపిణీ మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించారు. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు, తనను తాను అణగారిన వర్గాలకు మద్దతుదారుగా మారారని తెలియజేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
