కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళన సభకు భారీ వాహనాలతో బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో రాజ్యంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ,పట్టణ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు *శ్రీ మల్లికార్జున ఖర్గే * ముఖ్యతిధిగా విచేస్తున్న సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చెయ్యడానికి *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ * ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి 40 బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలపై 3వేల మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్,బ్లాక్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు,అనుబంధ సంఘాలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు…
