చిత్తూరు ఎమ్మెల్యే కుమారుని జన్మదినం
చిత్తూరు: చిత్తూరు శాసన సభ్యుడు గురజాల జగన్మోహన్ కుమారుడు.నితీష్. అలియాస్ లడ్డు జన్మదినం సందర్భంగా బెంగళూరులోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి పూల మాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా కలిగి ఉండాలని, పేద ప్రజలకు సహాయముచేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రఘు, శ్యామ్ సురేష్, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది. పి.ఏ.గవాస్కర్, కుమార్, తులసి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
