కుత్బుల్లాపూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్నగర్ పరిధిలోని కృషి కాలనీలో రూ.10 లక్షలతో UGD పనులు, అంజిరెడ్డి బస్తీలో రూ.20 లక్షలతో మంజీరా వాటర్ పైప్లైన్ పనులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (SDF) ద్వారా మంజూరైనా సందర్బంగా కృషి కాలనీ వాసులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో, అంజిరెడ్డి బస్తి సొసైటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు బాళ్లెం షామెల్, తన్నీరు శ్రీనివాస్, కండక్టర్ హరి, పి.గోపాల, మజీద్ పాషా, వెంకట్ రెడ్డి, సత్తిరెడ్డి చంద్రకాంత్, శాంతయ్య పంతులు, ప్రభాకర్, సిద్దు, లక్ష్మణ్, రాజు, నరసింహారెడ్డి, కృష్ణంరాజు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, హరికిరణ్, నాగిరెడ్డి, తులసి, గురువారెడ్డి, రాజు చారి, నాగేష్ రెడ్డి, ఆనంద్, తిరుపతి రెడ్డి, నరసింహ గౌడ్, రామ్ చందర్, చందు, కరణ్, శైలజ, అర్చన, బాలాజీ, రాహుల్, కొమురయ్య, సలోని, మల్లారెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
