సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు….రామయంపేట పట్టణం

TEJA NEWS

సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు….
రామయంపేట పట్టణంలో
కాంగ్రెస్ నాయకుడు గజవాడ నాగరాజు నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో నవ కుండాత్మక సుదర్శన నరసింహ హోమంలో
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావుకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో నాగరాజు ఈ కార్యక్రమంలోని చేపట్టడం ఎంతో సంతోషించేదగ్గ విషయం అన్నారు. నరసింహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామయంపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top