కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాలనీలో శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి 19వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాలనీలో శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి 19వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, సిద్ధునోల సంజీవ్ రెడ్డి, వన్నీరు గణేష్, మైసిగారి శ్రీనివాస్‌, నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top