సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం- నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 280 డివిజన్ జగత్గిరిగుట్ట వాసులు శ్రీమతి రామోజు లక్ష్మి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నది చికిత్సకి సరిపడ్డ డబ్బులు లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించక వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,00,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 2,00,000/- (రెండు లక్షల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను అనంత్ చారి కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, ఎల్లయ్య మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
