రైతులకు అన్యాయం చేస్తున్న భారత మాల.
గద్వాల్ :
భారత్ మాల రోడ్డుపై అండర్ బిడ్జి నిర్మాణం కై రాయపురం స్టేజ్ దగ్గర కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష.
ఈరోజుకు 9వ రోజుకు చేరుకున్నది.
రైతులకు భారత్ మాల రోడ్డు అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని,
రైతుల కు న్యాయం చేయాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా వారన్నారు.
నిరంతరంగ రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారందరికీ సంఘీభావంగా
మాజీ సింగల్ విండో చైర్మన్ గౌండ్ల రాముడు మబ్బు తిమ్మప్ప ఎంఆర్పిఎస్ నాయకులు జిల్లా నాయకులు ఇమాన్యుల్ మండల మాజీ అధ్యక్షులు తిమ్మప్ప బల్గేర ముఖ్యరన్న సల్కాపురం నాయకులు గంగిమన్ దొడ్డి ఆలూరు మాజీ సర్పంచ్ తిమ్మప్ప,గంగిమాన్ దొడ్డి నర్సింలు, రాయపురం గౌళ్ళ అమ్మన్న, గౌండ్ల కృష్ణయ్య గౌళ్ళ వీరేషు, పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ నాయకుడు ఇమ్మానియేల్, ఈ రోడ్డు మండలం అభివృద్ధి ఆధారపడిన విధానము వారు కొనియాడారు. రాయపురం వీరేష్ సభలో తన గొంతుతో నినాదాలు ఇచ్చారు.
