
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కొలన్ హన్మంత్ రెడ్డి ||
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా…… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర ఈద్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సహోదర భావం మరింత బలపడాలని కోరుకున్నారు.