
మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం పై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు స్పందిస్తూ దిగ్భ్రాంతి నీ వ్యక్తం చేశారు..
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు,, మరి కొంతమందికి తీవ్ర గాయాలతో బయటపడ్డారు ఇది అత్యంత విషాదకరమని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.
ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని,ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు..