
మానవత్వానికి గొప్ప ఉదాహరణ చలివేంద్రాల ఏర్పాటు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ..
128- చింతల్ డివిజన్ చంద్రానగర్లో బిఆర్ఎస్ మహిళా నాయకురాలు మెహ్రూన్నిసా బేగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివెంద్రాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….మానవత్వానికి గొప్ప ఉదాహరణ చలివేంద్రాల ఏర్పాటు అని, పాదాచారుల దాహర్తిని తీర్చడంలో చలివెంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో డేగ క్రిష్ణ మూర్తి, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నర్సింహా గౌడ్, శంకర్ గౌడ్, సదానంద్, అల్లా భక్షు, రాజు, కొండా శ్రీను, శ్రీశైలం యాదవ్, ఖలీల్, మురళీ, ఆదినారాయణ, బస్వరాజు, ప్రకాష్ గుప్తా, అల్లావుద్దీన్, రెడ్డి పద్మ, కరుణా భాయి తదితరులు పాల్గొన్నారు.