
చిలుకూరులో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశం…. అభివృద్ధికి అధికారులు, ప్రతినిధులు సహకరించాలి..*మండల ప్రత్యేక అధికారి దయానందరాణి..
: చిలుకూరు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చిలుకూరు మండల అభివృద్ధికి తోడ్పడాలని మండల ప్రత్యేక అధికారి దయానందరాణి సూచించారు. రైతు వేదికలో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ధ్రువకుమార్, ఎంపీడీవో నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.