
ఏపని అయినా విజయం సాధించాలంటే నమ్మకం (శ్రద్ధ), ఓర్పు (సబూరి) అవసరమని భోదించిన సద్గురు సాయిబాబా : బిఆర్ఎస్ ఎల్పి విప్,ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ .
125 – గాజుల రామారం డివిజన్ మహాదేవ పురం శ్రీశ్రీశ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం 14వ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్య ఆతిధిగా హాజరై సద్గురు సాయినాధుడికి వార్షిక విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ఏపని అయినా విజయం సాధించాలంటే నమ్మకం (శ్రద్ధ), ఓర్పు (సబూరి) అవసరమని భోదించిన సద్గురు సాయిబాబా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, ప్రసాద్, రంగారావు, సింహాచలం, సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, నవీన్, మాజీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ,సురేష్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, మూసా ఖాన్, చెట్ల వెంకటేష్, బోయిని మహేష్, చిన్నా చౌదరి, సాయిబాబా, సంగమేష్, శివా నాయక్, పలు డివిజన్లకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.