
బి పవర్ హౌస్ గుట్టపై ధనుర్ బాణా ఆంజనేయ స్వామి దర్శనం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతుల ప్రత్యేక పూజలు
పెద్దపల్లి : రామగుండం పట్టణంలోని బి పవర్ హౌస్ గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ ధనుర్ బాణా ఆంజనేయ స్వామి ఆలయాన్ని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , వారి సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దంపతులు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “మన ప్రాంతంలోని బి పవర్ హౌస్ గుట్టపై వెలసిన ఈ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు, ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు.
ఈ దర్శనంతో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.