
పల్నాడు కలెక్టర్కు సెకండ్ ర్యాంకు
భార్యా భర్తలైన నెల్లూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లు
హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా తమదైన మార్క్ చూపిస్తున్నారు. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఫైల్ క్లియరెన్స్లోనూ టాప్లో ఉన్నారు. మార్చి 11 నుంచి మే 5వ తేదీ వరకు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి హిమాన్షు 4.59 గంటలు, కృతికా 7.65 గంటల టైం తీసుకున్నారు. ఫైల్ క్లియర్సెన్లో ఈ ఇద్దరు కలెక్టర్లు మొదటి రెండు ర్యాంకులు సాధించడం విశేషం.