తిరుమలకు పోటెత్తిన భక్తులు

TEJA NEWS

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల : ఏపీలో వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య నాలుగు రోజులుగా పెరిగింది. ఫలితంగా ఆదివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటలు పడుతోంది. గత మూడు రోజుల్లో దాదాపు 2.5 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, శనివారం ఒక్కరోజే 90,211 మంది దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top