కాకాణి ఆణిముత్యమైతే ప్రసన్న పగడమా

TEJA NEWS

కాకాణి ఆణిముత్యమైతే ప్రసన్న పగడమా

తప్పులు చేశాడు కాబట్టే గోవర్ధన్ రెడ్డి ఫలితం అనుభవిస్తున్నాడు

వైసీపీ శ్రేణులే ఇక కాకాణిని నమ్మే ప్రసక్తే లేదు

చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్లీ అబద్ధాలు చెప్పడం ప్రసన్నకు అలవాటే

నెల్లూరు వేదాయపాళెంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు

కాకాణి కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వారి ఇంటికెళ్లడం సంతోషం

ఇద్దరూ వైసీపీ నాయకులే కాబట్టి వెళ్లొచ్చు…పరామర్శించుకోవచ్చు

గోవర్ధన్ రెడ్డి ఆణిముత్యం లాంటి నాయకుడని ప్రసన్న కీర్తించాడు..కాకాణి ఆణిముత్యమైతే ప్రసన్న పగడమా

ప్రసన్నకుమార్ రెడ్డికి కోవూరులో దిక్కులేకుండా పోయింది. ప్రశాంతమ్మ దెబ్బకు ఉన్న నలుగురూ ఆయన్ని వదిలేశారు

కాకాణి మంత్రిగా ఉన్నన్నాళ్లు ఏనాడూ ఆయనను కోవూరు నియోజకవర్గానికి రానివ్వని ప్రసన్నకు సడెన్ గా ప్రేమపెరిగిపోయింది

ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకున్న అనుబంధాలు ఉన్న మొహమాటంతోనే పరామర్శకు వచ్చినట్టున్నాడు

ఇప్పుడు కట్టు కట్టుకుని పాదయాత్రలకు బయలుదేరాడు..మొదటగా కాకాణి ఇంటికి వెళ్లాడు

సత్యహరిశ్చంద్రుడి పక్కింట్లో తానుంటే, మరో పక్క ఇంట్లో కాకాణి ఉండేవాడని ప్రసన్న చెబుతున్నట్టున్నాడు

కాకాణి గొప్పనాయకుడని కీర్తించిన ప్రసన్నకుమార్ రెడ్డికి సర్వేపల్లిలో ఆయన చేసిన ఘన కార్యాలను కూడా ప్రజలకు వివరిస్తే బాగుండేది

బూడిదతో వ్యాపారం చేసి ఎలా సంపాదించాలనే అంశంపై కాకాణి పి.హెచ్.డీ చేసిన అంశం ప్రసన్నకు తెలియదేమో

కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్ గేటు తెరిచి అక్రమ వసూళ్లకు తెరలేపి ఏకంగా కంటైనర్ టెర్మినల్ ను తరిమేసిన మహానుభావుడు కాకాణి

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసి కోట్లు సంపాదించడం తెలిసిన దిట్ట.

తాటిపర్తి వరదాపురంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి వందల కోట్ల విలువైన క్వార్ట్జ్ ను కొల్లగొట్టిన విషయం విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది

గిరిజనులను బెదిరించడంతో పాటు తప్పుడు పనులు చేసి అడ్డంగా బుక్కయి మా నాయకులపై పడి ఏడిస్తే ఏం లాభం

తప్పులు చేయబట్టే కేసుల్లో అడ్డంగా ఇరుక్కుపోయాడు

మొన్నటి దాకా నెల్లూరులోనే కాదు..రాష్ట్రంలోనే తనంత నాయకుడు లేడని కాకాణి జబ్బలు చరిచాడు.

ఆ ప్రెస్ మీట్లు చూసి అందరూ బిత్తరపోయారు..అబ్బో కాకాణిని ఎలా తట్టుకోవాలా…అని ఆలోచనలో పడ్డారు

ఒక్క కేసు నమోదు కాగానే ఆ జబ్బలు చరిచిన నాయకుడు పత్తా లేకుండా 60 రోజులు పారిపోయాడు

ఏదేని ఆరోపణలు వచ్చినప్పుడు తన సచ్చీలతను నిరూపించుకోవాల్సిందిపోయి పత్తా లేకుండా పారిపోయిన నాయకుడిని వైసీపీ శ్రేణులు ఎలా నమ్మాలి

కాకాణి రమణారెడ్డి మహానుభావుడని ప్రసన్నకుమార్ రెడ్డి కీర్తించాడు..ఆ రోజుల్లో రమణారెడ్డి వల్ల పడిన బాధలేంటో పొదలకూరు ప్రాంత రైతులను అడిగితే చెబుతారు

రమణారెడ్డిని శ్రీకృష్ణదేవరాయులతో, గోవర్ధన్ రెడ్డిని అశోక చక్రవర్తితో పోల్చి పొగడటం ప్రసన్నకే చెల్లింది

సర్వేపల్లికి కాకాణి అవుట్ డేటెడ్ నాయకుడైతే..కోవూరుకు ప్రసన్న అవుట్ డేటెడ్

ఇక ఇద్దరూ ఎప్పటికీ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదు.

ఎవరు ఆణిముత్యమో, ఎవరు పగడమో ప్రజలు చెప్పాలి..మీరిద్దరూ చెప్పుకుంటే కాదు

రెడ్ బుక్ ద్వారా తప్పులు చేసిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని లోకేష్ బాబు చెప్పారు..తప్పులు చేశారు కాబట్టే ఇరుక్కుపోతున్నారు

రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగిన ఆస్తుల విధ్వంసానికి, నమోదు చేసిన అక్రమ కేసులకు లెక్కలేదు..ఎందరో అమాయకులు ఉత్త పుణ్యానికి జైలుకుపోయివచ్చారు

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం మొదటి నుంచి అలవాటే. ఇక ఆయన్ని కోవూరులో నమ్మే ప్రసక్తే లేదు

ఇక పరామర్శలు చేసుకుంటూ గడపడమే ఆయన పని

ఇరిగేషన్ పనుల్లో ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన బాగోతాలు కూడా త్వరలోనే బయటపడున్నాయి.

ప్రజల సొత్తును దోపిడీ చేయడం వైసీపీ జీన్స్ లోనే ఉంది

ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టిందే సోమిరెడ్డి

1993లో కోవూరు ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవమంటే మేనమామ మీద గౌరవంతో ఎన్టీఆర్ ను ఒప్పించి ఆయన కుమారుడు ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించిన ఘనత సోమిరెడ్డిది

రాజకీయంగా విలువలు కోల్పోయిన ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు పరామర్శ యాత్రలకు బయలుదేరాడు

You cannot copy content of this page

Scroll to Top