ప్రభుత్వ పాఠశాలలో అక్షర అభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ జగన్ …
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగుబస్తీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట అక్షర అభ్యాసం కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల, ఉపాధ్యాయులు రేఖ, సుష్మ, జితేందర్, షణ్ముఖ నాయకులు పాపయ్య గౌడ్. మల్లారెడ్డి.ch మహేందర్ రెడ్డి హనుమంతు. యాదగిరి. వెంకటేష్ .బసవేశ్వర్. సంపత్ రెడ్డి. సిద్ధులు. శాంతి. ఝాన్సీ. తదితరులు పాల్గొన్నారు
