భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ చిలకలూరిపేట

TEJA NEWS

భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ చిలకలూరిపేట విద్యార్థిని మూకిరి మహాలక్ష్మి ట్రిపుల్ ఐటీ సీట్ కైవసం… అభినందించిన ఉపాధ్యాయ సిబ్బంది.

స్థానిక భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేట నుండి 2024- 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి 576 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన మూకిరి మహాలక్ష్మి అనే విద్యార్థిని నిన్న వెలువడిన ట్రిపుల్ ఐటీ ఫలితాలలో, నూజివీడు ఐఐఐటీ నందు సీటు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థినిని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కష్టపడి బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవాలని , ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ప్రధానోపాధ్యాయులు ఆ విద్యార్థినిని దీవించారు.

You cannot copy content of this page

Scroll to Top