
నగర మేయర్ మహంకాళి స్వామి ని మర్యాదపూర్వకంగా కలిసిన సింగరేణి వైద్యాధికారుల బృందం…
పెద్దపల్లి//గోదావరిఖని: సింగరేణి వైద్యాధికారుల బృందం రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ని కలిసి అభినందనలు తెలిపారు. సింగరేణి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ బాల కోటయ్య, చీఫ్ మెడికల్ ఆఫీసర్, కిరణ్ కుమార్, రెనే హాస్పిటల్ అధినేత బంగారి స్వామి తదితరులు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయానికి విచ్చేసి మేయర్ కు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షాలు తెలిపారు. మేయర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.