పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా, హైదర్ నగర్ డివిజన్ లోని ఈద్గా వద్ద ముస్లిం

TEJA NEWS

పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా, హైదర్ నగర్ డివిజన్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలసి నమాజ్ చేసిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు. త్యాగానికి, కరుణకు మరియు మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను మీ ప్రార్థనలన్నీ ఫలించి, మీ కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర పర్వదినాన అల్లాహ్ మీ ప్రార్థనలను, త్యాగాలను స్వీకరించి, మీ ఇంట ఆనందాలు నింపాలని కోరుకుంటూ.. ఈద్ ముబారక్ అని నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top