స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ పై ఏసీబీ కేసు

TEJA NEWS

స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ పై ఏసీబీ కేసు

మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని 40 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు 40 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top